అడవిపందిని చంపిన నిందితులకు షాకిచ్చిన పోలీసులు

అడవిపందిని చంపిన కేసులో నిందితులకు పోలీసులు రూ.50 వేలు జరిమానా విధించారు.

Update: 2024-10-05 05:55 GMT

దిశ, మంగపేట: అడవి పందిని చంపి అమ్ముతున్న మండలంలోని కమలాపురంకు చెందిన కొలిమి రమేష్, కత్తుల భీముడు, బోయ సంపత్ లపై కేసు నమోదు చేసి వారికి రూ.50 వేల జరిమానా విధించినట్లు రేంజి అధికారులు షకిల్ పాషా, కోటేశ్వర్ లు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగపేట మండలంలోని కమలాపురం శివారు హనుమాన్ టెంపుల్ సమీప అడవిలో కొలిమి రమేష్, కత్తుల భీముడు, బోయ సంపత్ లు అడవి పందిని చంపి విక్రయిస్తున్నట్లు సెప్టెంబర్ 29న అటవీ అధికారులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు ఫారెస్ట్ అధికారులు దాడి చేసి నిందితులను పట్టుకుని కేసు నమోదు చేసి జిల్లా ఫారెస్టు అధికారికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల విచారణ అనంతరం నిందితులైన కొలిమి రమేష్, కత్తుల భీముడు, బోయ సంపత్ లపై కేసు నమోదు చేసి రూ.50 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.


Similar News