శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి.. ఎస్సై ఎస్.కె హమీద్

మండల ప్రజలు శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని, మతసామరస్యానికి ప్రతీకగా నిలవాలని ఎస్సై హామీద్ అన్నారు.

Update: 2024-10-12 10:30 GMT

దిశ, బచ్చన్నపేట : మండల ప్రజలు శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని, మతసామరస్యానికి ప్రతీకగా నిలవాలని ఎస్సై హామీద్ అన్నారు. దసరా పండగ సందర్బంగా శనివారం ఆయుధపూజ, వాహనాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ చెడు పై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ నిర్వహించుకుంటామని, ఎప్పటికైనా మంచి మార్గమే విజయానికి సోపానం అవుతుందని అన్నారు. అదేవిధంగా దసరా పండుగ సందర్భంగా సాయంత్రం నిర్వహించే జంబి, రావణ దహన కార్యక్రమానికి అందరూ సహకరించాలని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు, అధికారులకు పోలీస్ సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.


Similar News