యువకుడి ప్రాణాలు తీసిన చెట్టు

ములుగు జిల్లా వాజేడు మండలం లో గురువారం రాత్రి రోడ్డుపై పడిపోయిన చెట్టు యువకుడి ప్రాణాలు తీసింది.

Update: 2024-10-11 06:27 GMT

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా వాజేడు మండలం లో గురువారం రాత్రి రోడ్డుపై పడిపోయిన చెట్టు యువకుడి ప్రాణాలు తీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన యాలం భూపతి రావు (32) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తాడ్వాయి మండలం బీరెల్లి- కాటాపూర్ రోడ్డు బంజర వద్ద గాలివానకు రోడ్డుపై పడి ఉన్న చెట్టుకు ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళుతున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తన పోలీసు బలగాలతో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News