గవర్నర్ ను కలిసిన వ్యవసాయ, హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీలు

ఇటీవల తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు గవర్నర్ కొత్త వైస్ ఛాన్సలర్లను నియమించిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-21 15:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు గవర్నర్ కొత్త వైస్ ఛాన్సలర్లను నియమించిన సంగతి తెలిసిందే. కాగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా నియమించబడిన అల్దాస్ జానయ్య నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. నేరుగా గవర్నర్ వద్దకు వెళ్ళి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయనతో సమావేశమయ్యి వ్యవసాయ వర్సిటీలో బోధన, పరిశోధన, విస్తరణ రంగాలను అభివృద్ది చేసేందుకు తన ప్రణాళికలను గవర్నర్ కు వివరించారు జానయ్య. అలాగే నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ డా.రాజిరెడ్డి కూడా గవర్నర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.  


Similar News