వరాస్ చెస్‌ అకాడమీ విజేతలకు క్యాష్ ప్రైజ్ అందజేత

వరాస్ ఇంటర్నేషనల్ రాపిడ్ ఓపెన్ ఫైడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో భాగంగా విజేతలకు నగదు బహుమతి అందజేశారు.

Update: 2024-10-21 16:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వరాస్ ఇంటర్నేషనల్ రాపిడ్ ఓపెన్ ఫైడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో భాగంగా విజేతలకు నగదు బహుమతి అందజేశారు. హైదరాబాద్ జీపీ బిర్లా సెంటర్‌లో సోమవారం జరిగిన ఈ చెస్ పోటీల్లో విజేతలకు మొత్తం రూ.3 లక్షల క్యాష్ ప్రైజ్ అందజేసినట్లు వరాస్ చెస్ అకాడమీ ఫౌండర్, చీఫ్ కోచ్ రాఘవ్ శ్రీవాత్సవ్ తెలిపారు. మొత్తం 98 మందికి ట్రోఫీలు అందజేయగా అందులో 68 మందికి రూ.3 లక్షల క్యాష్ ప్రైజ్‌ను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా మొదటి బహుమతి తోట ధృవకు దక్కిగా ఆయనకు రూ.30 వేల క్యాష్ ప్రైజ్ అందజేశారు. రెండో బహుమతిని ఆకుల ప్రణయ్ దక్కించుకోగా రూ.20 వేలను అందజేశారు. కుందు కౌస్తవ్‌కు మూడో బహుమతిగా రూ.15 వేలను అందించారు. కాగా, విజేతలకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఐపీఎస్ రాజశేఖర్, ఎస్బీఐ మాజీ ఏజీఎం అశోక్ బహుమతులు అందజేశారు.


Similar News