అర్ధరాత్రి అనుకోని అతిధి..భయంతో ఇంట్లో వాళ్ల పరుగు

అనుకోని అతిధి అర్ధరాత్రి ఇంట్లో ప్రత్యక్షమవ్వడంతో ఇంట్లో వాళ్ల భయంతో పరుగులు పెట్టాల్సివచ్చింది.

Update: 2024-10-09 07:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : అనుకోని అతిధి అర్ధరాత్రి ఇంట్లో ప్రత్యక్షమవ్వడంతో ఇంట్లో వాళ్లు భయంతో పరుగులు పెట్టాల్సివచ్చింది. అటవీ ప్రాంతాల్లో సంచరించే కొండ చిలువ జనావాసాల్లోకి వచ్చి ఓ ఇంట్లోకి చొరబడి ఫ్రిడ్జ్ పైన ప్రత్యక్షమైంది. అనుకోని అతిధి కొండచిలువ రూపంలో అర్ధరాత్రి అనూహ్యంగా ఇంట్లోని ఫ్రిడ్జ్ పైన దర్శనమివ్వడాన్ని చూసిన ఇంట్లోని జనం భయంతో ఇల్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కరీంనగర్ జిల్లా మంకమ్మతోటలోని నర్సన్న అనే వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ భారీ కొండచిలువ చొరబడి హల్ చల్ చేసింది. ఫ్రిడ్జ్ పైకి ఎక్కి వస్తువులను కింద పడేయడంతో ఆ శబ్ధానికి నిద్ర నుంచి లేచిన కుటుంబ సభ్యులు ఏమైందని పరిశీలించారు.

ఫ్రిడ్జ్ పై కొండచిలువను చూసిన నర్సన్న కుటుంబ సభ్యులు భయంతో బయటికి పరుగులు తీశారు. పోలీసులకు సమాచారం అందించగా, వారు స్నేక్ క్యాచర్ ను తీసుకుని వచ్చారు. స్నేక్ క్యాచర్ కొండచిలువను బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు.

Similar News