ఆదివాసీల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి హామీ

సీఎం రేవంత్ రెడ్డితో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ సంఘాలు భేటీ అయ్యాయి

Update: 2024-10-09 09:03 GMT



దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డితో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ సంఘాలు భేటీ అయ్యాయి. ఆదివాసీలు, మైనారిటీ వర్గాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చొరవతో  సీఎం రేవంత్ రెడ్డితో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరైన ఆదివాసీ నాయకులు తమ సమస్యలను సీఎంకు వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. తమ భూములు, ఉద్యోగాలు తమకే దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దీపావళి లోపు అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, డిమాండ్ల సాధ్యసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆదివాసీలకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కలు కూడా ఉన్నారు. 

Similar News