సుప్రీంకోర్టుకు తెలంగాణ గ్రూపు-1 అభ్యర్థులు

తెలంగాణ గ్రూపు-1(Telangana Group-1) మెయిన్స్ వివాదం సుప్రీంకోర్టు(Supreme Court)కు చేరింది.

Update: 2024-10-18 07:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గ్రూపు-1(Telangana Group-1) మెయిన్స్ వివాదం సుప్రీంకోర్టు(Supreme Court)కు చేరింది. గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు దేశ అత్యున్నత న్యాయస్థాయంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం రూల్ ఆఫ్ లా పాటించడం లేదని అభ్యర్థుల తరపు లాయర్ మోహిత్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ వచ్చే సోమవారం విచారణకు రానుంది. మరోవైపు గ్రూపు-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాల్లో తప్పులు ఉన్నాయని పలువురు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టి వేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ వారు డివిజన్ బెంచ్‌‌లో అప్పీల్ చేయగా.. ఆ అప్పీల్‌ను హైకోర్టు పాస్ ఓవర్ చేసింది.


Similar News