Kadiyam Srihari: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైంది.. కడియం శ్రీహరి సెన్సేషనల్ కామెంట్స్

పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో తెలంగాణ రాష్ట్రం (Telangana State) పూర్తిగా దోపిడీకి గురైందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-21 14:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో తెలంగాణ రాష్ట్రం (Telangana State) పూర్తిగా దోపిడీకి గురైందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ స్టేషన్ ఘన్‌పూర్‌ (Station Ghanpur)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ (KCR) కుటుంబం నిలువునా దోచేసిందని కామెంట్ చేశారు. రాజకీయాల్లో వచ్చిన నాటి నుంచి కేసీఆర్ (KCR) ఆస్తులను ప్రజల ముందుకు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)లకు తెలంగాణ రాష్ట్రంపై (Telangana State)పై ప్రేమ లేదని.. ఆ రెండు పార్టీలు కేవలం ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన వారు నేడు రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుంచి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) కేవలం ఫామ్‌హౌస్‌ (Farm House)కే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో కనుమరుగవ్వడం ఖాయమని కడియం శ్రీహరి జోస్యం చెప్పారు. 


Similar News