ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే : కాసాని జ్ఞానేశ్వర్

Update: 2023-10-04 16:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని, కేడర్‌ను సైతం సంసిద్దం చేశామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో బుధవారం పార్టీ అనుంబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుపై దేశవ్యాప్తంగా మద్దతు వస్తుందన్నారు. ఓపిక నశిస్తే అనార్దాలకు దారి తీస్తాయని.. దీనిని దృష్టిలో ఉంచుకొని జగన్ ప్రభుత్వం అక్రమకేసులు మానుకోవాలని హితవు పలికారు.

రాబోయే ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ పాల్గొననున్నారని స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు క్యాంపెయిన్ లో పాల్గొంటారని, రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం చాటుతామని, టీడీపీ సత్తా చాటుతామన్నారు. దేశానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, కాసాని వీరేశ్, జక్కలి ఐలయ్యయాదవ్, బంటు వెంకటేశ్వర్లు, సాయి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


Similar News