మున్సిపల్ కార్మికులను ఢీకొన్న లారీ

సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న ముగ్గురు మున్సిపల్ కార్మికులను లారీ ఢీకొన్న సంఘటన మంగళవారం ఉదయం సత్తుపల్లిలో చోటుచేసుకుంది.

Update: 2024-10-08 04:48 GMT

దిశ,సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న ముగ్గురు మున్సిపల్ కార్మికులను లారీ ఢీకొన్న సంఘటన మంగళవారం ఉదయం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి పట్టణ పరిధిలోని బాలాజీ థియేటర్ ఎదురుగా ఫుట్పాత్ పక్కన పారిశుద్ధ్య పనులు చేపట్టిన ముగ్గురు కార్మికులను విశాఖపట్నం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ వెనకనుంచి ఢీకొనడంతో మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ కు చెందిన ఇడుపులపాటి వెంకటేశ్వరరావు, తడికమళ్ళ మరియమ్మ, వెంగళరావునగర్ కి చెందిన తాళ్ల వెంకటమ్మ,కు గాయాలయ్యాయి. దీంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక సిపిఐ నాయకులు పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటన పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News