నేడు నాంపల్లి కోర్టుకు నాగార్జున.. సర్వత్రా ఉత్కంఠ

టాలీవుడ్ హీరో నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. కొండాసురేఖపై వేసి పరువునష్టం దావాలో తన స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నారు.

Update: 2024-10-08 04:29 GMT

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన నాగార్జున.. ఆమెపై పరువునష్టం దావా వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. నాగార్జునను కోర్టుకు రావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు నేడు నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరై.. తన వెర్షన్ ను వినిపించనున్నారు. ఆయనిచ్చే స్టేట్మెంట్ ను రికార్డు చేయనుంది కోర్టు.

నాగార్జునతో పాటు మరికొందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది. సాక్షులుగా మరో ఇద్దరి వాంగ్మూలాలను కూడా తీసుకుంటారని సమాచారం. కాగా.. నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దావాలో.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్లు, వీడియోలను అటాచ్ చేశారు. ముఖ్యంగా మీడియాతో చై-సామ్ విడాకుల గురించి ప్రస్తావించడం, అందుకు కారణం మాజీ మంత్రి కేటీఆరేనని ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. యావత్ టాలీవుడ్ అంతా నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 


Similar News