రాచకొండ కమిషనరేట్ పరిధిలో 27 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ
రాచకొండ పోలీస్ కమిషనరేట్లో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి.
దిశ, సిటీ క్రైం: రాచకొండ పోలీస్ కమిషనరేట్లో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 27 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సుధీర్బాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో ఎలాంటి పైరవీలకు అస్కారం లేకుండా.. సిబ్బంది పనితీరు ఆధారంగా పోస్టింగ్స్ ఇచ్చినట్లుగా పోలీస్ వర్గాలు చెపుతున్నాయి. కాగా, బదిలీ అయిన 27 మంది ఇన్స్పెక్టర్లు మంగళవారం ఆయా ప్రాంతాల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.