ప్రాణం ఉన్నంత వరకు మీరే మా నాయకుడు.. KCRపై పోచారం మాట్లాడిన పాత వీడియో వైరల్

తెలంగాణ మాజీ స్పీకర్, బీఆర్ఎస్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

Update: 2024-06-21 12:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ స్పీకర్, బీఆర్ఎస్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. 20 ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే ఓపిక సీఎం రేవంత్ రెడ్డికి ఉందన్నారు. మాకు వయసు అయిపోయిందన్నారు. కాగా, పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గతంలో ఆయన కేసీఆర్ గురించి మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ బహిరంగ సభలో ఆనాటి సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. జన్మలో మిమ్మల్ని మరవం సార్.. ప్రాణం ఉన్నంత వరకు మీరే మా నాయకుడు సార్.. ఇంకొకరు లేరు సార్ అని పోచారం అన్నారు.

47 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి నాయకుడిని చూడలేదని పోచారం అన్నారు. అనేక మంది నాయకులను తాను చూశానని.. రకరకాల మనుషులు ఉంటారని.. చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నారు. చాలా మంది మంత్రులను, ముఖ్యమంత్రులను తాను చూశానని.. కానీ మనస్ఫూర్తిగా, సహృదయంతో.. చల్లని చూపుతో సహాయం చేసిన వ్యక్తిని మిమ్మల్నే చూస్తున్నా అన్నారు. నా నియోజకవర్గమే కాదు.. రాష్ట్రమంతా సుభిక్షంగా మారుస్తున్నారు అన్నారు. కోట్లాది రుపాయలు, లక్షలాది రుపాయలు పంటలు పండుతున్నాయని.. దేశమంతా మీ కోసం ఎదురు చూస్తోంది సార్ అన్నారు. అయితే పోచారం కాంగ్రెస్ కండువా కప్పుకున్న అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Similar News