పెళ్లి నిశ్చితార్థం జరగాల్సి ఉండగా యువతి అదృశ్యం

మండలంలోని తాండూరు గ్రామానికి చెందిన మునిగే పల్లి కృష్ణవేణి (21) అనే యువతి మంగళవారం నుండి అదృశ్యమైనట్లు స్థానిక ఎస్సై రాజు తెలిపారు.

Update: 2024-03-13 16:08 GMT

దిశ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని తాండూరు గ్రామానికి చెందిన మునిగే పల్లి కృష్ణవేణి (21) అనే యువతి మంగళవారం నుండి అదృశ్యమైనట్లు స్థానిక ఎస్సై రాజు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం తాండూర్ గ్రామానికి చెందిన మునిగేపల్లి రాజయ్య అనే వ్యక్తికి ముగ్గురు సంతానం కాగా తన రెండో కూతురైన కృష్ణవేణికి ఈనెల 14వ తేదీన లింగంపేట

    మండలం పోల్కంపేట్ గ్రామానికి చెందిన యువకునితో పెళ్లి నిశ్చితార్థం జరగాల్సి ఉంది. కృష్ణవేణి మంగళవారం రాత్రి ఏడున్నర సమయం నుండి ఇంటి వద్ద తన కూతురు కనిపించడం లేదని, బంధువుల వద్ద, తెలిసినవారి వద్ద వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదని తెలిపారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో తమ కూతురు కనిపించడం లేదని మునిగేపల్లి రాజయ్య ఫిర్యాదు చేయగా అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. 


Similar News