మహమ్మద్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం…

మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు మూడు ఇండ్లకు నిప్పంటుకుంది.

Update: 2024-08-17 16:09 GMT

దిశ, నిజాంసాగర్: మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు మూడు ఇండ్లకు నిప్పంటుకుంది. రెవెన్యూ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గూల సాయమ్మ, బంగ్లింటి రామవ్వ, బంగ్లింటి బీర్ గొండ నివాసపు ఇండ్లకు నిప్పంటుకున్నట్లు తెలిపారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. నివాసపు ఇండ్లు పూర్తిగా కాలిపోవడంతో ఆస్తి నష్టం సుమారుగా రూ. 10 లక్షల రూపాయలు జరిగినట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని మండల కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తోట రాజు, మహమ్మద్ నగర్ మండల యువజన అధ్యక్షుడు మల్లయ్య గారి ఆకాష్ తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం చెల్లించి ఇండ్లు కోల్పోయిన వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంగ సంగమేశ్వర్, గూడ భూమేష్, మంగ కాశిరం, మంగ సురేష్, కృష్ణ అలాగే కురుమ సంఘం యూత్ అధ్యక్షుడు సాయి తేజ తదితరులు ఉన్నారు.


Similar News