బిచ్కుందలో మహిళ దారుణ హత్య..

ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హత్య చేసి ఆమె ఇంట్లో చోరీ చేసిన ఘటన బిచ్కుందలో ఆదివారం చోటు చేసుకుంది.

Update: 2024-09-29 17:15 GMT

దిశ, మద్నూర్ : ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హత్య చేసి ఆమె ఇంట్లో చోరీ చేసిన ఘటన బిచ్కుందలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బిచ్కుంద మండల కేంద్రంలో గోనె కాశవ్వ (65) ఒంటరిగా నివసిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం పండరి అనే యువకుడు వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమెను హతమార్చాడు. అనంతరం ఆమె దగ్గరున్న వస్తువులను చోరీ చేశాడు. సమాచారం అందుకున్న బిచ్కుంద సీఐ జగడం నరేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News