మండల కేంద్రంలో శతాధిక వృద్ధురాలు మృతి..

రాజంపేట మండల కేంద్రానికి చెందిన శతాధిక వృద్ధురాలు ఆదివారం కన్నుమూశారు.

Update: 2024-09-29 11:39 GMT

దిశ, రాజంపేట : రాజంపేట మండల కేంద్రానికి చెందిన శతాధిక వృద్ధురాలు ఆదివారం కన్నుమూశారు. గ్రామానికి చెందిన కందారపు రాజవ్వకు సుమారు (105) సంవత్సరాలు ఉంటుందని కుమారులు తెలిపారు. కందారపు రాజవ్వ మృతి పట్ల కాలనీవాసులు ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. కందారపు రాజవ్వకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు, ఆమెకు ఆరుగురు మనుమలు, ముగ్గురు మనుమరాళ్లు ఉన్నట్లు తెలిపారు. రాజవ్వ మృతి పట్ల కుటుంబ సభ్యుల్లో, బంధువుల్లో, కాలనీ వాసుల్లో ఎంతో విషాదకరం నింపాయి.


Similar News