ప్రొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రం ప్రారంభం

మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు.

Update: 2024-03-13 11:57 GMT

దిశ,మద్నూర్ : మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొద్దుతిరుగుడు పంటకు క్వింటాకు మద్దతు ధర 6,760 లభ ఇంచినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, వ్యవసాయ శాఖ అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సభ్యులు పాల్గొన్నారు.


Similar News