మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి ఐదు రోజులు జైలు శిక్ష

లింగంపేట మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన భూపాల్ అనే వ్యక్తికి కోర్టు ఐదు రోజుల జైలు శిక్షతోపాటు 500 రూపాయలు జరిమానా విధించినట్లు ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు.

Update: 2024-03-15 08:57 GMT

దిశ, లింగంపేట్ : లింగంపేట మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన భూపాల్ అనే వ్యక్తికి కోర్టు ఐదు రోజుల జైలు శిక్షతోపాటు 500 రూపాయలు జరిమానా విధించినట్లు ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. గురువారం వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ భూపాల్ పట్టుబడ్డట్లు తెలిపారు. భూపాల్ ను ఎల్లారెడ్డి కోర్టులో హాజరుపరుచగా న్యాయమూర్తి ఐదు రోజుల జైలు శిక్షతోపాటు 500 రూపాయలు జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భూపాల్ ను కామారెడ్డి సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఎస్ఐ సూచించారు. మద్యం నడుపుతూ వాహనాలు నడిపే కేసులు నమోదు చేసి జైలుకు తరలించనున్నట్లు హెచ్చరించారు. 


Similar News