నాన్న మరణంతో ఒక శకం ముగిసింది.. మాజీ మేయర్ సంజయ్

శనివారం తెల్లవారుజామున నిజామాబాద్ సీనియర్ రాజకీయ దిగ్గజం డి.శ్రీనివాస్ మృతి చెందిన విషయం విధితమే.

Update: 2024-06-29 08:59 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : శనివారం తెల్లవారుజామున నిజామాబాద్ సీనియర్ రాజకీయ దిగ్గజం డి.శ్రీనివాస్ మృతి చెందిన విషయం విధితమే. అయితే ఆయన మృతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ లో ఉన్న డీఎస్ నివాసం వద్దకు ఉదయం నుంచి వివిధ పార్టీ నాయకులు ఆయన అభిమానులు, చేరుకొని డీఎస్ పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ ను కలిసి ఓదార్చారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ నిజామాబాద్ రాజకీయాల్లో తమ నాన్న మృతితో ఒక శకం ముగిసిందని పేర్కొన్నారు.

ఆయనా ప్రతి ఒక్కరిని పేదవారిని దగ్గరికి పిలుచుకొని వారి సమస్యలను పరిష్కరించడంలోఎనలేని కృషి చేశారని అన్నారు. నిజామాబాద్ లో ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని ఈరోజు అంటే శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి అభిమానులు వివిధ పార్టీ నాయకుల సందర్శనార్థం ఆయన పార్థివదేవాన్ని ప్రగతినగర్ లోని ఆయన నివాసంలో ఉంచుతామని చెప్పారు.

Similar News