రూ.20 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 20 లక్షల నిషేధిత డ్రగ్స్ ను అబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు.

Update: 2024-03-14 11:02 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 20 లక్షల నిషేధిత డ్రగ్స్ ను అబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. గురువారం నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలోని ఇంటర్నేషనల్ హోటల్ వద్ద నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్ఫోర్సు మెంట్ అధికారులు వాహనాల తనిఖీ నిర్వహించారు. తనిఖీ సమయంలో ఓ కారులో అనుమానాస్పదంగా ఉన్న ఒక వ్యక్తి ని తనిఖీ చేయగా ఆ వ్యక్తి బ్యాగ్ లో 2 కేజీ ల ఆల్ఫ్రాజోలం అనే మాదకద్రవ్యం లభించింది. సదరు వ్యక్తిని విచారించగా రాజస్థాన్ రాష్టంలోని నాగౌర్ జిల్లా లాడ్ను గ్రామవాసి భవాని సింగ్ గా గుర్తించారు.

    ఆల్ఫ్రజోలం ను కల్తీ కల్లు తయారీకి వాడతారు. దీనిని రాజస్థాన్ లోని ముఖేష్ సింగ్ నుంచి తీసుకుని వచ్చి హైదరాబాద్ కుకట్ పల్లికి చెందిన సుదర్శన్ కు విక్రయించనున్నట్టు తెలిపారు. పోలీసులు కారు, 20 లక్షల వరకు విలువ గల 2 కిలో ల ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు.

    మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపినారు. ఈ దాడుల్లో నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎన్ఫోర్సుమెంటు అధికారులు డి. చంద్రభాను నాయక్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్లు పి. స్వప్న, ఎ.వెంకటేష్, ఎస్ ఐ లు ఎం. విక్రమ్ కుమార్ , టి. నర్సింహ చారి, సిబ్బంది రాజన్న, హమీద్, ఉత్తమం, శివ, విష్ణు, అవినాష్, గంగారాం, లక్ష్మన్ పాల్గొన్నారు. నిషేధిత డ్రగ్స్ ను పట్టుకున్న అధికారులను సిబ్బందిని డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అభినందించారు. 


Similar News