జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

Update: 2024-03-15 12:12 GMT

దిశ, నాగిరెడ్డిపేట్ : జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం పోచారం గ్రామానికి చెందిన షేక్ షౌకత్ అలీ (35) అనే వ్యక్తికి భార్య షబీనా, ఇద్దరు కుమారులు ఉండగా గత

     మూడు సంవత్సరాల క్రితం భార్య షబీనా సంసారం విషయంలో భర్తతో గొడవపడి మూడు సంవత్సరాలుగా హైదరాబాద్​లో తన తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. షౌకత్ అలీ తన భార్య కాపురానికి రాదేమోనని బెంగతో తాగుడుకు బానిసై గురువారం రాత్రి తన ఇంట్లో చీరెతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న మసూద్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. 


Similar News