అభ్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా పని చేయాలి : మహమ్మద్ అలీ షబ్బీర్

అభ్యర్థి ఎవరైనా... గెలుపే లక్ష్యంగా పని చేసి, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ

Update: 2024-10-12 08:18 GMT

దిశ, భిక్కనూరు : అభ్యర్థి ఎవరైనా... గెలుపే లక్ష్యంగా పని చేసి, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లకు పట్టభద్రుల ఎమ్మెల్సీని కానుకగా ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. శనివారం కామారెడ్డి నియోజకవర్గ పట్టభద్రులతో మెదక్ జిల్లా జప్తి శివనూర్ వద్ద ఉన్న తన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రభుత్వం చాలా నమ్మకంతో ఉందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ఎన్నిక కావడంతో అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పని చేయాలన్నారు.వెంటనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియను చేపట్టాలన్నారు. అభ్యర్థి ఎంపిక ఈ నెలాఖరులో ఉంటుందని, ప్రభుత్వ పథకాలను వివరిస్తూ యూత్ ను ఆకట్టుకునే విధంగా ప్రచారం చేయాలన్నారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పట్టభద్రులుపాల్గొన్నారు.


Similar News