కారు ఢీకొని యువకుడి దుర్మరణం

నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి వద్ద గురువారం రాత్రి కారు ఢీకొని యువకుడు దుర్మారనం చెందాడు.

Update: 2024-03-14 16:25 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి వద్ద గురువారం రాత్రి కారు ఢీకొని యువకుడు దుర్మారనం చెందాడు. అర్సపల్లికి చెందిన రాజు (30) బోధన్ రోడ్డు నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా అర్సపల్లి రైల్వే గేట్ వద్ద గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో రాజు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. కారు డ్రైవర్ తప్పించకుపోయినట్టు స్థానికులు తెలిపారు. ఆరవ టౌన్ ఎస్సై రమేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. 


Similar News