అనుమానాస్పద స్థితిలో..ఓ వ్యక్తి మృతి

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

Update: 2024-10-14 14:08 GMT

దిశ ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాజారాం నగర్ లో నివాసముంటున్న బుల్ల నరేష్ (40) ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. మృతుడు గత నాలుగు నెలల క్రితం గల్ఫ్ దుబాయ్ దేశం నుంచి స్వదేశానికి వచ్చాడు. ప్రస్తుతం ఓ రైస్ మిల్లులో పనిచేస్తూ..కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


Similar News