తాను చనిపోతూ ఇద్దరు పిల్లల్ని బావిలో తోసేసిన తండ్రి

కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

Update: 2024-10-13 15:17 GMT

దిశ, తాడ్వాయి: కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.దసరా పండగ వేళ కొత్త బట్టలు వేసుకుని సరదాగా గడపాలని ఆశించిన ఆ చిన్నారులు కాలగర్భంలో కలిసిపోయారు. ఓ తండ్రి తాను చనిపోతూ ఇద్దరు పిల్లల్ని బావిలో తోసేసిన మృతి చెందిన ఘటన తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో చోటుచేసుకుంది. నందివాడ గ్రామంలో వ్యవసాయ బావిలో ఇద్దరు పిల్లలు మృతదేహలు వెలుగు చూసాయి. ఈ సంఘటన శనివారం రాత్రి అలస్యంగా వెలుగు చూసింది. చనిపోయిన వారిని విగ్నేష్ (7), అనురిద్ (5)మృత దేహాలు గుర్తించారు. దసరా పండగ సంధర్భంగా తండ్రి చిట్టపు శ్రీనివాస్ రెడ్డి తో కలిసి కోత్త బట్టలు వేసుకుని ఇద్దరు పిల్లలు విగ్నేష్, అనిరుద్ లు జంబి కోసం బయటకు వెళ్లినట్లు తెలిసింది. రాత్రి వరకు రాకపోవడంతో అనుమానంతో గాలించగా ఇద్దరు పిల్లల వ్యవసాయ బావిలో విగత జీవులుగా కనిపించారు. చిట్టపు శ్రీనివాస్ రెడ్డి తన పిల్లలను బావిలో తోసేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బావి వద్ద శ్రీనివాస్ రెడ్డి సెల్ పోన్ తో పాటు చేతి గడియారం, చెప్పులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి డెడ్ బాడి కోసం బావిలో గజ ఈతగాళ్ల చేత గాలింపు చర్మలు చేస్తున్నారు. శ్రీనివాస్ నందివాడకు ఇళ్లరికం వచ్చినట్టు తెలిసింది. శ్రీనివాస్ రెడ్డి తన పిల్లలను బావిలో తోసేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 'పెటుంబ కలహల కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.ఈ విషయం తాడ్వాయి పోలీసులు సమాచారం అందించగా ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు, కామారెడ్డి సిఐ రామన్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బంది ఘటన స్థలానికి వచ్చి .. బావిలో ఇద్దరు పిల్లల శవాలు కనిపించాయన్నారు.కాని శ్రీనివాస్ ఫోన్, చెప్పులు, బావి దగ్గర కనిపించడంతో.. అతను కూడ ఆత్మ హత్య చేసుకొని ఉంటాడని భావించి పోలీసులు మోటార్ల సాయంతో బావిలోంచి నీళ్లు తోడేయ్యడంతో శ్రీనివాస్ మృతదేహం లభించింది. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.మృతుని భార్య అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.


Similar News