ప్రజల గుండెల్లో మహా నేతగా గుర్తింపు పొందిన వైయస్సార్ : మంత్రి కోమటిరెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషిచేసి మహానేతగా గుర్తింపు పొందాడని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Update: 2024-07-08 14:10 GMT

దిశ, చిట్యాల: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషిచేసి మహానేతగా గుర్తింపు పొందాడని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనీ వైయస్సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగానే కాకుండా మహోన్నత వ్యక్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ఉండిపోయాడ ని, ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా కీర్తించారు. ఈ కార్యక్రమంలో బోవనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, జడల చిన్న మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News