యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.

Update: 2024-10-06 15:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. విద్యార్థులకు దసరా సెలవులు, ఉద్యోగులకు ఆదివారం కలిసి రావడంతో ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీంతో క్యూలైన్లలో భక్తులు గంటలు గంటలు స్వామివారి దర్శనానికి ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రత్యేక దర్శనానికి కూడా రెండు గంటల సమయం పట్టింది. స్వామివారికి నిత్యకల్యాణం జరిపే సమయానికి మెట్లదారిలోనూ భక్తులు వేచి ఉండటం.. భక్తుల తాకిడికి ఎంతగా ఉందో ఊహించవచ్చు. అంతేకాదు ప్రసాదాల విక్రయం వద్ద, శ్రీసత్యనారాయణ స్వామి వ్రత మండపంలో, కొండకింది విష్ణు పుష్కరిణిలో, బస్ స్టాండ్ వద్ద కూడా విపరీతమైన రద్దీ ఏర్పడింది. కాగా సెలవులు ఉండటంతో భక్తులు అధికంగా వచ్చారని, అయినప్పటికీ ఎక్కడా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు.


Similar News