కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ

యాదాద్రి భువనగిరి జిల్లా కరెన్సీ దుర్గాదేవి దర్శనమిస్తున్నారు.

Update: 2024-10-06 12:26 GMT

దిశ,చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా కరెన్సీ దుర్గాదేవి దర్శనమిస్తున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో.. దుర్గాదేవి మంటపాన్ని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆదివారం రోజున సుమారు 45 లక్షల రూపాయలతో మంటపాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం అమ్మవారిని ప్రత్యేక అలంకరణగా ఏర్పాటు చేసేందుకు కరెన్సీ నోట్లతో అలంకరించినట్లు తెలిపారు.


Similar News