Sub collector : కూలిన ఇండ్ల ను పరిశీలించిన సబ్ కలెక్టర్

ఇటీవల కురిసిన వర్షాలకు కూలిన ఇండ్లను మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ శనివారం పరిశీలించారు.

Update: 2024-09-07 11:33 GMT

దిశ, వేములపల్లి: ఇటీవల కురిసిన వర్షాలకు కూలిన ఇండ్లను మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండొద్దని సూచించారు. ఇల్లులు కూలడంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు 50 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. గ్రామానికి చెందిన కుల జ్యోతి, బంటు మట్టయ్య, చింతకాయల లచ్చమ్మలకు చెందిన ఇండ్లు కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఇల్లు కూలిపోయిన బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.


Similar News