ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా కీలక సూచనలు చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డి

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఈనెల 17న

Update: 2024-09-16 15:58 GMT

దిశ,నల్లగొండ: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఈనెల 17న ,ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారని, అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారని, దీంతోపాటు బాల బాలికలచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో,ప్రభుత్వ సంస్థలలో, స్థానిక సంస్థలలో, గ్రామపంచాయతీలలో,అన్ని కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ఆయన తెలిపారు.


Similar News