Koosukuntla Prabhakar Reddy : ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలి..

రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం అలైన్మెంట్ లో మార్పులు చేయాలని

Update: 2024-09-18 13:13 GMT

దిశ,చౌటుప్పల్: రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం అలైన్మెంట్ లో మార్పులు చేయాలని రైతులతో కలిసి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ముందు బుధవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ... చౌటుప్పల్ లో వ్యవసాయ భూముల్లో నుండి త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను వ్యవసాయ బొమ్మల నుండి కాకుండా వ్యవసాయేతర భూముల్లో నుంచి వెళ్లేలా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.ఇప్పటికే భూములను కోల్పోతున్న పలువురు రైతులకు భూములకు బదులు భూముల ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

చౌటుప్పల్ జంక్షన్ నిర్మాణం కోసం తిరిగి అలైన్మెంట్ ను మార్చడం వల్ల నిరుపేద రైతుల తమ భూమిని కోల్పోవాల్సి వస్తుందని కావున ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి కి అందించారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ పీఎఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గిరికటి నిరంజన్ గౌడ్, పలువురు రైతులు పాల్గొన్నారు.


Similar News