దిశ ఎఫెక్ట్...మోదుగులకుంట కబ్జాపై స్పందించిన అధికారులు

నల్లగొండ జిల్లా కేంద్రంలోని మోదుగులకుంట కబ్జా కోరల్లో చిక్కి అన్యాక్రాంతం అవుతుందని దిశలో వచ్చిన కథనంతో ఇన్​చార్జి ఆర్డీఓ శ్రీదేవి స్పందించారు.

Update: 2024-09-26 14:01 GMT

దిశ,నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని మోదుగులకుంట కబ్జా కోరల్లో చిక్కి అన్యాక్రాంతం అవుతుందని దిశలో వచ్చిన కథనంతో ఇన్​చార్జి ఆర్డీఓ శ్రీదేవి స్పందించారు. కుంట స్థలానికి ఎమ్మార్వో శ్రీనివాస్ తో వెళ్లి ఆరా తీశారు. సర్వే చేయాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోదుగుల కుంట కబ్జా పై వచ్చిన కథనం ఆధారంగా కుంటని పరిశీలించామన్నారు. కుంట ఎఫ్టిఎల్, బఫర్ జోన్ ల హద్దులు పెట్టాలని ఇరిగేషన్ అధికారులను కోరినట్టు చెప్పారు. ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Tags:    

Similar News