దిశ ఎఫెక్ట్.. కేఆర్సీపురం లో వీధి దీపాలు ఏర్పాటు

గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుపుతూ "దిశ" దిన పత్రికలో శనివారం ప్రచురితమైన "సెక్రటరీలు లేరు.. స్పెషల్ ఆఫీసర్లు రారు".

Update: 2024-09-07 13:50 GMT

దిశ, నడిగూడెం: గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుపుతూ "దిశ" దిన పత్రికలో శనివారం ప్రచురితమైన "సెక్రటరీలు లేరు.. స్పెషల్ ఆఫీసర్లు రారు". అనే కథనానికి అధికారులు స్పందించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి సయ్యద్ ఇమామ్ ఆదేశాల మేరకు పంచాయతీ ఇన్ చార్జ్ కార్యదర్శి ఆర్. మల్లారెడ్డి ఆధ్వర్యంలో శనివారం పంచాయతీ సిబ్బంది మండలంలోని కేఆర్సీపురం లో వీధి దీపాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా పలు గ్రామాల్లో పేరుకు పోయిన చెత్త చెదారాన్ని సిబ్బంది తొలగించారు. తమ సమస్యలను పరిష్కరించే విధంగా చేసిన "దిశ" దిన పత్రిక కు మండల ప్రజలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.


Similar News