BREAKING: సూర్యాపేట జిల్లాలో విస్తృతంగా పోలీసుల తనిఖీలు.. రూ.4.76 లక్షల నగదు సీజ్

లోక్‌సభ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

Update: 2024-03-19 14:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సరిహద్దులతో పాటు ప్రధాన చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నేతలు ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర వుస్తువలతో ప్రలోభాలకు గురి చేయకుండా రాత్రింబవళ్లు రోడ్లపై పకడ్బందీగా పహారా కాస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం చెక్‌పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ.4.76 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడతో క్యాష్‌ను సీజ్ చేశారు.  

Tags:    

Similar News