Raghunandan Rao : రెండు పార్టీల ఆలోచన విధానం ఒకటే.. ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్డెస్క్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం బడ్జెట్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తోందన్నారు. తెలంగాణ ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఆలోచన విధానం ఒకటే అన్నారు. జెండాలు మారాయి తప్ప విధానాలు మారలేదన్నారు. మార్పు ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడమే అన్నారు. మహిళలకు రూ.2500, వరికి రూ.500 బోనస్ ఇస్తామన్నారని రాష్ట్ర బడ్జెట్లో ఆ రెండు హామీలకు కేటాయింపులు ఏవి అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రూ.35,500 కోట్ల రుణం తెచ్చారని.. కొడంగల్కు రూ.5వేల కోట్లు ఇచ్చుకున్న రేవంత్కు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.