అల్లాపూర్ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ కాలనీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బుధవారం స్థానిక కార్పొరేటర్ సబీహా బేగం, వివిధ విభాగాల అధికారులతో కలిసి పర్యటించారు.
దిశ, కూకట్పల్లి: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ కాలనీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బుధవారం స్థానిక కార్పొరేటర్ సబీహా బేగం, వివిధ విభాగాల అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్ పరిధిలోని సున్నం చెరువు పార్కును పరిశీలించారు. పార్కు పనులను వేగంగా పూర్తి చేయాలని, వాకర్స్కు అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులకు కావలసిన నిధులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తే నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని అన్నారు. డివిజన్ పరిధిలోని తులసి నగర్ కాలనీలో వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను మార్చాలని కాలనీ వాసులు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఈఈ సత్యనారాయణ, ఏఈ రంజిత్, జలమండలి డీజీఎం రవి, లైన్ మెన్ మొగులయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ బలరాం, డివిజన్ అధ్యక్షుడు లింగాల ఐలయ్య, వీరారెడ్డి, పిల్లి తిరుపతి, నాగుల సత్యం, సంజీవ్ రెడ్డి, కొండల్ రెడ్డి, నూర్, జావీదుద్దిన్, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, సత్యమ్మ, లక్ష్మి, సన్నజాజుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.