బాలిక అత్యాచార ఘటన పై కఠిన చర్యలు తీసుకోండి.. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

బాలిక అత్యాచారం ఘటనలో నిందితునికి కఠిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద.

Update: 2024-10-23 08:20 GMT

దిశ, పేట్ బషీరాబాద్ : బాలిక అత్యాచారం ఘటనలో నిందితునికి కఠిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ఈ మేరకు బుధవారం ఇరువురు కలిసి మేడ్చల్ జోన్ డీసీపీని కలిసి కేసు విషయమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూడడమే కాకుండా నిందితుడికి కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డీసీపీని కోరారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి భౌరంపేట్ లో ఐదు రోజుల క్రితం నాలుగేళ్ల చిన్నారిని హింసించి అత్యాచారయత్నం చేసిన ఘటనలో ఇప్పటికే దుండిగల్ పోలీసులు పోక్సో ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.


Similar News