మేడ్చల్ లో డ్రగ్ కంట్రోల్ అధికారుల మెరుపు దాడులు

మేడ్చల్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు మెరుపు దాడులను నిర్వహించారు.

Update: 2024-10-23 13:21 GMT

దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు మెరుపు దాడులను నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసు, డ్రగ్ ఇన్స్పెక్టర్ హేమలత మౌనికల ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణ పరిధిలోని ఆర్ఎంపీ క్లినిక్ లపై దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా విక్రయిస్తున్న 20 వేల రూపాయల విలువ గల మందులను గుర్తించి సీజ్ చేశారు.

మితిమీరుతున్న ఆర్ఎంపీల ఆగడాలు

మేడ్చల్ జిల్లాలో ఆర్ఎంపీల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు కూడా చేయని ఆపరేషన్ లను ఆర్ఎంపీలు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తెలిసితెలియని వైద్యాన్ని చేస్తున్నారు. పదవ తరగతి చదివిన వారు కూడా డాక్టర్లుగా అవతారం ఎత్తి ఏకంగా క్లినిక్​ను ఏర్పాటు చేసుకొని వైద్యం అందిస్తున్నారు.

    దీంతోపాటు మెడికల్ షాపులను సైతం ఏర్పాటు చేసుకొని అందినంత దోచుకుంటున్నారు. ఇంజక్షన్లు చేస్తూ, గ్లూకోజ్ పెడుతూ చికిత్స చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా వైద్యం చేస్తున్నారు. ఇకనైనా ఆర్ఎంపీ డాక్టర్ల ఆగడాలకు బ్రేక్ పడేనా లేదా అని వేచి చూడాలి. 

Tags:    

Similar News