Amoy Kumar: ఈడీ విచారణకు ఐఏఎస్ అమోయ్ కుమార్.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

ఈడీ ఎదుట హాజరైన ఐఏఎస్ అమోయ్ కుమార్

Update: 2024-10-23 06:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పశుసంవర్ధక సంయుక్త కార్యదర్శి అమోయ్ కుమార్ ఈడీ ఎదుట హాజరయ్యారు. బుధవారం ఉదయం బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేశారు. ఆ సమయంలో అబ్దుల్లాపూర్ మెట్ భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న కేసులో అమోయ్ కుమార్ పై ఆరోపణలు వచ్చాయి. అమోయ్ కమార్ తమ భూములు బెదిరించి తీసుకున్నారని రెవెన్యూ అధికారులకు పోలీసులకు స్థానిక రైతులు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారంలో అమోయ్ కుమార్ పాత్రపై నిజానిజాలు తేల్చేందుకు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో మీడియా కంట పడకుండా ఇవాళ ఉదయం 8 గంటలకు అమోయ్ కుమార్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు కలెక్టర్ గా పని చేసిన సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్ పై ఈడీ విచారణ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతున్నది. ఈ కేసు వ్యవహారం అంతిమంగా ఏ రూపం తీసుకోబోతున్నదనేది ఉత్కంఠగా మారింది. 


Similar News