ప్రేమపెళ్లి విఫలమైందని యువకుడి ఆత్మహత్య

Update: 2024-08-14 12:58 GMT

దిశ, కౌడిపల్లి : ప్రేమపెళ్లి విఫలమైందని మనస్థాపానికి గురైన యువకుడు ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన మండలంలోని కంచనపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చౌదరిపేట ఆంజనేయులు(22) గత మూడు నెలల నుంచి చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. రెండు వారాల క్రితం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ కంచనపల్లికి వచ్చారు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. ఇరువురి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పెద్దలు కూర్చొని మాట్లాడుతుండగా అమ్మాయి తన తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆంజనేయులు మనస్థాపానికి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం పొలం వద్దకు వెళ్తున్నానని తల్లి లలితకు చెప్పి.. అక్కడ చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు అతనికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. పొలం వద్దకు వెళ్లి చూడగా ఆంజనేయులు మద్ది చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించాడు. మృతునికి తల్లిదండ్రులు మల్లేశం లలిత ఉన్నారు. తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News