ఎస్ఐ వేధింపులు భరించలేక మహిళా ఏఎస్సై ఆత్మహత్యాయత్నం

మెదక్ జిల్లా చిలిపిచెడ్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ సుధారాణి

Update: 2024-10-10 12:15 GMT

దిశ, చిలిపి చెడ్ : మెదక్ జిల్లా చిలిపిచెడ్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ సుధారాణి ఆత్మహత్యయత్నం చేశారు. ఎస్సై యాదగిరి తనను వేధిస్తున్నాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎస్ఐగా చిలప్ చేడ్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ విధులకు హాజరుకానట్లు కానిస్టేబుల్స్ తో హాజరుకానట్లు రికార్డులో వేయిస్తున్నారని కావాలని టార్గెట్ చేసేలా వ్యవహరిస్తున్నారంటు ఏ ఎస్ఐ తెలిపారు. సూసైడ్ నోట్ రాసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య ప్రయత్నం చేసిన సుధారాణిని పోలీస్ వాహనంలో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఎస్సై యాదగిరి పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారుంది. పై అధికారి తనను వేధిస్తున్నారంటూ బాహాటంగా సూసైడ్ నోట్ రాసి మరి ఆత్మహత్న ప్రయత్నం చేసిన ఏఎస్ఐ ఇంతకీ ఆ పోలీస్ స్టేషన్లో ఏం జరిగి ఉంటుంది..? అనే కోణంలో అటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎస్సై యాదగిరిని వివరణ కోరగా తనకు ఇది వరకే ఓ వివాహం కాగా మరో వివాహం చేసుకున్నారని మొదటి వివాహం చేసుకున్న భర్తతో కొంత వేధింపులు ఉండేవని తనకు తెలిపినట్లుగా ఈ విషయంపై న్యాయం చేయాలని తనను కోరినట్లు ఆయన తెలిపారు. ఆమెను వేధిస్తున్నట్లు చేస్తున్న ఆరోపణలన్నీ వాస్తవాలేనని ఆయన అన్నారు. దానిని ఆసరాగా తీసుకొని ఈ బురదను నాపై చల్లే ప్రయత్నం చేస్తుందని ఆయన తెలిపారు. నేను విధులకు మాత్రమే తప్పక హాజరు కావాలని తెలుపగా ఆమె నాపై కక్ష కట్టి ఈ విధంగా ఆరోపణలు చేస్తుందని ఆయన తెలిపారు.

విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటాం.. : డీఎస్పీ

ఈ సంఘటనపై తుప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి స్పందించారు. గురువారం నాడు చిలిపిచేడ్ పోలీస్ స్టేషన్ కు హాజరై జరిగిన సంఘటనకు గల కారణాలను ఎస్సై యాదగిరిను అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ మహిళ ఏఎస్ఐ అతనిపై ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామని డి.ఎస్.పి వెంకట్ రెడ్డి అన్నారు. ఆయనతోపాటు నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి ఉన్నారు.


Similar News