రేపు సిద్దిపేటలో వైద్య సేవలు బంద్

Update: 2024-08-16 13:14 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : కలకత్తా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మహిళా పీజీ డాక్టర్ హత్యకు నిరసనగా ఐఎంఏ పిలుపు మేరకు శనివారం ఆగస్టు 17న సిద్దిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు నిలిపి వేస్తున్నట్లు సిద్దిపేట ఐఎంఏ అధ్యక్షుడు భాస్కర్ రావు, కార్యదర్శి రవికాంత్ ప్రకటనలో తెలిపారు. పీజీ డాక్టర్ ను అత్యంత పాశవికంగా మానభంగం చేసి కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రజాస్వామ్య వాదులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా, కుల సంఘాల ప్రతినిధులు నిరసనకు సహకరించాలని కోరారు. ఆసుపత్రులు మూసి వేసి ఉంటాయని ప్రజలు గమనించాలన్నారు.

Tags:    

Similar News