వివాహితుడిపై మాజీ ప్రియురాలు పెళ్లి ఒత్తిడి.. తట్టుకోలేక ఆత్మహత్య

Update: 2024-08-17 13:03 GMT

దిశ, నిజాంపేటః ఆల్రెడీ పెళ్ళైన యువకుడిని తనను పెళ్లి చేసుకోవాలంటూ మాజీ ప్రియురాలు ఒత్తిడి తెచ్చింది. భార్య ఉండగా పెళ్లి చేసుకోవాలని వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన కొమ్మాట భాను ప్రసాద్(26) గతంలో ఇదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించగా వరసలు కలవకపోవడంతో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. దాంతో మిరిదొడ్డి గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిపించారు. అయితే ప్రేమించిన అమ్మాయి మాత్రం తనను కూడా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి వేధించిందిని స్థానికులు చెబుతున్నారు. దాంతో మనస్థాపనికి గురైన భాను ప్రసాద్ బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు వ్యవసాయ పొలం వద్ద ఉన్న చింత చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి కొమ్మాట శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని నిజాంపేట ఎస్సై శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News