Fake note : మర్మాములలో నకిలీ నోటు కలకలం
మద్దూరు మండలం మర్మాముల గ్రామంలో శుక్రవారం నకిలీ నోటు కలకలం రేపింది.
దిశ, మద్దూరు : మద్దూరు మండలం మర్మాముల గ్రామంలో శుక్రవారం నకిలీ నోటు కలకలం రేపింది. విద్యుత్ బిల్ కలెక్టర్ ఇస్తారీ విద్యుత్ బిల్లులు వసూలు చేస్తుండగా అదే గ్రామానికి చెందిన సుంకోజు బ్రహ్మం కరెంటు బిల్లు చెల్లించ్చేటప్పుడు 200 నోట్లు 10 ఇచ్చినాడని, క్యాష్ కౌంటింగ్ మిషన్ లో కౌంటింగ్ చేస్తుండగా నోటు నంబర్ 669339 గల 200 నోటు నకిలీదిగా గుర్తించినట్టు తెలిపారు. నకిలీ నోటును తిరిగి సుంకోజు బ్రహ్మంకు ఇవ్వనున్నట్లు బిల్ కలెక్టర్ ఇస్తారి తెలిపారు.