బైక్ అదుపుతప్పి ఒకరికి తీవ్ర గాయాలు

బైక్ అదుపుతప్పి ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం సాయంత్రం మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

Update: 2024-10-12 13:46 GMT

దిశ, మిడ్జిల్ :బైక్ అదుపుతప్పి ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం సాయంత్రం మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.వాడియాల గ్రామానికి చెందిన బొర్ర కృష్ణయ్య 40 కల్వకుర్తిలో నివాసం ఉంటున్నాడు.విజయదశమి పండుగ సందర్భంగా..తన ద్విచక్ర వాహనంపై కల్వకుర్తి నుంచి వాడియాల్ గ్రామానికి వెళ్తున్నాడు.ఈ క్రమంలో మిడ్జిల్ మండల కేంద్రంలో పైలాన్ 167 వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డాడు.దీంతో కృష్ణయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి.గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించారు.పండుగ పూట వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు అవడంతో..కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.


Similar News