వెయ్యి కోళ్లు ఉచితంగా పంపిణీ

విజయదశమి పర్వదినం సందర్భంగా.. మండల కేంద్రంలోని జెకె ట్రస్ట్ ఆధ్వర్యంలో నవాబుపేట గ్రామ ప్రజలకు వెయ్యి కోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు.

Update: 2024-10-13 15:33 GMT

దిశ, నవాబుపేట: విజయదశమి పర్వదినం సందర్భంగా.. మండల కేంద్రంలోని జెకె ట్రస్ట్ ఆధ్వర్యంలో నవాబుపేట గ్రామ ప్రజలకు వెయ్యి కోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఇటీవల ఇదే ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలకు వంట సామాగ్రి, వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ట్రస్ట్ నిర్వాహకులు పండుగ సందర్భంగా 1000 ఉచితంగా పంపిణీ చేసి.. గ్రామస్తులు అందరూ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నరసింహ్మ చారి, సుధాకర్ చారిలతో పాటు వారి కుటుంబ సభ్యులు,ట్రస్ట్ డైరెక్టర్లు రఘువీర్ శర్మ, పుట్టి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


Similar News