లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ కమిషనర్

పెబ్బేరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబి అధికారులు దాడులు నిర్వహించారు

Update: 2024-10-22 13:10 GMT

దిశ పెబ్బేరు:పెబ్బేరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబి అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపల్ కమీషనర్ ఆదిశేషులు రూ.20,000 లంచం తీసుకుంటుండగా అడ్డుపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా ఎసిబి అడిషనల్ ఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..పెబ్బేరు మున్సిపాలిటీలో జనరల్ ఫండ్స్ నుంచి 2023 లో కాంట్రాక్టర్ ఒక్కొక్క పని 83,930 మూడు పనులు చేయగా.. పనులకు దాదాపు రెండు లక్షల యాబై వేల రూపాయలకు పైగా రావాల్సి ఉంది. దీంతో అతని బిల్లులు చేయడానికి కమిషనర్ 25000 డిమాండ్ చేయగా ..చివరికి 20వేలతో ఒప్పుకోవడం జరిగిందనీ తెలిపారు. వివరాలను కాంట్రాక్టర్ ఏసీబి అధికారుల దృష్టికి తీసుకుపోగా అధికారులు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో దాడులు నిర్వహించి..రెడ్ హ్యాడెడ్ గా పట్టుకోవడం జరిగిందనీ తెలిపారు.


Similar News