రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.

Update: 2024-10-02 10:58 GMT

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సిరిసిల్ల, కరీంనగర్ ప్రధాన రహదారిలోని వెంకట్రావ్ పల్లి వద్ద సర్కిల్ ను వేములవాడ ఏఎస్పీతో కలిసి ఆయన సందర్శించి జంక్షన్ లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

    ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి (బ్లాక్ స్పాట్స్) ప్రమాదాలకు గల కారణాలు తెలుసుకొని వాటి నివారణకు సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాదాల నివారణ చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాల వేగాన్ని నియంత్రించడానికి రోడ్లపై, మూలమలుపుల వద్ద, అప్రోచ్ రోడ్ల వద్ద బారీకేడ్స్, రబ్బర్ స్టిప్స్, సైన్ బోర్డ్స్, స్పీడ్ బ్రేకర్స్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎస్పీ వెంట ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీందర్ గౌడ్ ఉన్నారు.  

Tags:    

Similar News